పశ్చాత్తాపం (06/06/2011)ఒక అడవిలో కాకి, పిచ్చుక ఎంతో స్నేహంగా ఉంటుండేవి. అవి ఒకదానిని మరొకటి ఆపద సమయంలో ఆదుకోవడమే కాక ఒకదాని పిల్లల్ని మరొకటి ఎంతో ప్రేమగా చూసుకుంటుండేవి. వింతగొర్రె (06/06/2011)ఒక రోజు ఒక వ్యాపారస్తుడు కొన్ని గొర్రెలతో అడవి దాటుతుండగా అందులో ఒక గొర్రె దారితప్పి ఆ దట్టమైన అడవిలోనే ఉండిపోయింది. అక్కడ క్రూరమృగాలు ఉంటాయి, వాటి బారిన పడి చస్తానేమోనని గొర్రె చాలా భయపడింది. అందుకే దేనికంటా పడకుండా జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా అటూ ఇటూ తిరగసాగింది. ఒకరోజు గొర్రెకు ఒక సింహం తోలు కనబడింది. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది. ‘ఏ క్రూరమృగం ఎప్పుడు దాడి చేస్తుందోనని చస్తూ బతుకుతున్నాను. ఈ తోలును కప్పుకుంటే నేను కూడా సింహంలా కనబడతాను. అప్పుడు నా జోలికి ఎవరు రారు’ అని అనుకుంది. నక్కమామ- కుందేలు (06/06/2011)అనగనగా ఒక అరణ్యంలో ఒక కుందేలు ఉండేది. దానికి ఏ మాత్రం తెలివితేటలు లేవు. దానికి ఒక్కసారి కూడా ఎటువంటి ప్రవూదం ఎదురు కాలేదు. అందువల్ల దానికి భయువుంటే ఏమిటో కూడా తెలీదు. ఒకరోజు బాగా ఎండగా ఉంది. కుందేలుకు విపరీతమైన దాహం వేసింది. దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరకు బయులుదేరింది. దారిలో ఒక నక్క ఎదురరుుంది. కుందేలును చూడగానే నక్క నోట్లో నీళ్లూరారుు. అరుుతే అది కుంటినక్క. ఒక కాలు సరిగ్గా లేకపోవడంతో కుందేలును వేటాడడం దానికి సాధ్యం కాదు. అందుకని ఒక ఉపాయం పన్నింది. తిక్కకుదిరింది (02/06/2011)అనగనగా ఒక అడవిలో ఒక కుక్క ఉండేది. అది పరమ పిసినారి. ఒకసారి దానికి ఒక మాంసం ముక్క దొరికింది. దానిని ఏ వీధి అరుగుమీదో, ఏ చెత్తకుండీచాటునో కూర్చుని తినచ్చు కదా! ఊహూ... తోటి కుక్కలు చూస్తే తమకూ కాస్త పెట్టమంటాయని దాని భయం. ఎందుకంటే అది ఎప్పుడూ మిగతా కుక్కల దగ్గర ఆహారం అడిగి తినేది. అందుకే ఆ మాంసం ముక్కను తీసుకుని చాటుగా ఊరవతలికి బయలుదేరింది. తెలివైన నక్క (01/06/2011) నడ్డి విరిగిన నక్క (01/06/2011)
సమయస్ఫూర్తి కథ ( 01/06/2011)
దోచుకునేవాడికి దొరికినంత. (01/06/2011)అనగనగా ధర్మపురి రాజ్యం. ఆ రాజ్యానికి రాజు సత్యవంతుడు. ఆ రాజు వద్ద చిత్రాంగుడు అనే సేవకుడు పనిచేసేవాడు. రాజు దర్శనం కోసం ప్రతిరోజు దర్భారుకు వచ్చే ప్రజలను లోనికి అనుమతించడానికి పదో, పాతికో పుచ్చుకోవడం అతని అలవాటు. ప్రజల సమస్యలను సాను కూలంగా విని ధర్మానికి లోపడి పరిష్కారించే రాజు కు సేవకుడి తీరు వేగుల ద్వారా తెలిసింది. అక్ర మంగా సేవకుడు ప్రజలను దోచుకోవడం రాజుకు నచ్చలేదు. వెంటనే ఆ సేవకుణ్ణి రాజ మందిరం నుంచి తొలగించి భక్తులను వరు సగా పంపించేలా దేవాలయం ముందు నియ మించాడు. కనీసం దైవభక్తి, పాపభీతి తో నైనా డబ్బులు తీసుకోవడం మానివేస్తాడని రాజు ఆలోచించాడు. రెండురోజులు నమ్మకంగా పని చేసి గుడికి వచ్చిపోయేవారిని గమనించిన ఆ సేవకుడు మూడోరోజునుంచి ప్రత్యేకదర్శనం అంటూ భక్తులతో కూడా డబ్బులు తీసుకోవడం ప్రారంభించాడు. వేగుల ద్వారా విషయం తెలు సుకున్న రాజు చిత్రాంగుడిలో మార్పురాకపోవ డంతో ఆశ్చర్య పోయాడు. ఉద్యోగం నుంచి తొలగిస్తే అతని కుటుంబం వీధిన పడుతుందని భావించాడు. ఏలాగైన అతనిలో మార్పు తీసుకు రావాలన్న ప్రయత్నంతో శ్మశానం వద్ద కాపలాదారుడిగా నియమించాడు. రాజ మందిరంలో దర్జాగా, దేవాలయం లో నిత్యం దేవుడిని చూస్తూ ఉండాల్సిన తాను శ్మశానం ముందు కాపలా దారుడిగా పనిచేస్తున్నందుకు సేవకుడు పశ్చాత్తాప పడతాడని రాజు భావించారు. కాని సేవకుడిలో మార్పులేదు. రెండు, మూడు రోజులు పరిస్థితులు గమ నించాడు చిత్రాంగుడు. ఆ తరువాత కర్మకాండలకు వచ్చే వారి నుంచి డబ్బులు వసూలుచేయడం ప్రారంభించాడు. ఇది గమనించిన రాజు ఇక లాభం లేదనుకున్నాడు. చిత్రాంగుడినే పిలిచి కారణం తెలుసుకుని కఠినంగా శిక్షిం చాలని నిర్ణయించాడు. అతడిని రాజదర్భారుకు పిలిపించి, నిండు సభలో 'ఉచితంగా చేయాల్సిన పనుల కోసం ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం తప్పు కదా. ఎందుకు చేశావు' అని ప్రశ్నించాడు. శాంతంగా ఉండే మహారాజు ఉగ్రరూపం చూసి సభలోని వారందరూ భయంతో వణికి పోయారు. చిత్రాంగుడికి మరణశిక్ష తప్పదని భావించారు. కాని చిత్రాంగుడు మాత్రం బెదర లేదు. ఎంతో శాంతంగా 'మహారాజా!, నేను చేసింది తప్పే. కాని రోజు అనేకమందిని డబ్బులు అడి గాను. కొందరు ఎమి అనకుండా ఇచ్చారు, మరికొందరు తిట్టుకుంటూ ఇచ్చారు. కాని ఎవ్వరు కూడా ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించలేదు. మీకు వచ్చి ఫిర్యాదు చేయలేదు. మీరు రోజు అందరినీ కలిసి వారి సమస్యలు వింటారని తెలుసు. కాని ముందుగా తామే మీ మందిరానికి రావాలన్న ఆరా టంతో నేను అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చే వారు. ఇక దేవాలయంలో దేవుడు అందరినీ ఒకేలా చూస్తాడు. కాని ఎక్కువ తప్పులు చేసిన వాడికి ప్రత్యేకపూజలు అనగానే తాము చేసిన పాపాలు పోతాయని నమ్మకం. అందుకే డబ్బులు ఇచ్చేవారు. ఇక శ్మశానంలో కూడా కర్మకాం డలు త్వరగా ముగించాలని ఆరాటమే తప్ప పోయిన మనిషిపై మమకారం లేదు. అందుకే డబ్బులు ఇచ్చారు. తూతూ మంత్రంగా కర్మ కాండ చేసి వెళ్లిపోయారు. డబ్బులు ఇచ్చే ప్రజ లకు లేని పట్టింపు తీసుకునే నాకు ఎందుకు రాజా'' అని ఎదురు ప్రశ్నవేసాడు. చిత్రాంగుడి తీరుకు సభలోని వారు ఆశ్చర్యపోయారు. రాజు నోట మాట లేదు. తప్పు సేవకుడిది కాదు అత నిని అవినీతి దిశగా ప్రేరేపించిన ప్రజలదే అన్న వాస్తవం తెలుసుకున్నాడు. లంచం తీసుకునే వాడి కన్నా ఇచ్చేవాడికే ఎక్కువ శిక్ష ఉంటుందని సభలో ప్రకటిం చాడు. అంతే ఆ రోజు నుంచి చిత్రాంగుడితో పాటు అనేక మందిలో మార్పు వచ్చింది. ధర్మపురి రాజ్యం ఎందరికో ఆదర్శం అయ్యింది. పిల్లలూ! ఇప్పుడు చెప్పండి! ఈ కథ ద్వారా మీకు ఏం అర్థం అయ్యిందో! ఇచ్చేవాడు ఉంటే తీసుకునేవాళ్లకి లోటు లేదు. అందుకే ప్రశ్నించడం నేర్చుకోండి |