Telugu Stories    Contract All | Expand All

వజ్రాల మూట(06/07/2011)

ఒకసారి వివేకవర్మ వుహారాజు దగ్గరకు ఒక వ్యక్తి న్యాయుం కోసం వచ్చాడు. అతడు వుహారాజుకు వందనం చేసి, ‘‘వుహారాజా! నా పేరు గోపాలుడు. వూ యజమాని పేరు నీలంకంఠుడు. ఆయన నాకు వజ్రాలు ఇస్తానని చెప్పి మోసం చేశారు. మీరే నాకు న్యాయుం చేయూలి’’ అని వేడుకున్నాడు.

‘‘నీకు జరిగిన అన్యాయాన్ని వివరంగకా చెప్పు’’ అన్నాడు మహారాజు.
‘‘ప్రభూ! ఒకరోజు నేను, వూ యజమాని వేరే రాజ్యం నుండి ఇంటికి తిరిగి వస్తున్నాం. కుండపోతగా వర్షం కురుస్తుండటంతో దగ్గరలో ఉన్న ఒక పురాతన ఆలయుం లోపలికి వెళ్లి తలదాచుకున్నాం. ఆ ఆలయుంలో వూకు వజ్రాలు కనిపించారుు. మా యజమాని వెంటనే వాటిని తీసుకొని మూట కట్టాడు. ‘ఈ ఆలయుంలో వునకు వజ్రాలు దొరికాయుని ఎవరితోనూ చెప్పకు. ఇంటికి చేరాక నీకు వీటిలో సగం వాటా ఇస్తాను’ అని చెప్పాడు. నా వాటాగా వచ్చే వజ్రాలను అవుు్మకుని ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చని నేను అప్పుడు ఏమీ అనలేదు. మీరే న్యాయుం చెప్పండి’’ అని వివరించాడు గోపాలుడు.

గోపాలుడి యజమాని అయిన నీలకంఠుడిని పిలిపించాడు వుహారాజు.
"వుహాప్రభూ! ఇతడు చెప్పే వూటలు పచ్చి అబద్ధాలు. ఆ వజ్రాలు దొరికినవూట నిజమే. ఏ వస్తువు దొరికినా అది మీకే చెందుతుందని భావించి, ఆ వజ్రాలను నేనే స్వయంగా వుూటకట్టి ఇతనితో మీ వద్దకే పంపించాను" అని చెప్పాడు. "దీనికి సాక్షులు ఎవరైనా ఉన్నారా?" అని అడిగాడు వుహారాజు. "లేకేం, నా భార్య, అత్తగారు చూశారు ప్రభూ" అన్నాడు నీలకంఠుడు.
వుహారాజు వారిద్దరినీ పిలిపించాడు. వారు వచ్చాక, వారిద్దరినీ వజ్రాలు కట్టిన వుూట ఏ రంగులో ఉంటుందో చెప్పవుని విడివిడిగా అడిగాడు. ఇద్దరూ వేరువేరు సవూధానాలు చెప్పారు. దీంతో నీలకంఠుడి మోసం బయుటపడింది.

"నీలకంఠా! వెంటనే వజ్రాలు నాకు అప్పగించు. గోపాలుడిని మోసం చేసినందుకు అతనికి వేరుు బంగారు నాణాలు పరిహారంగా ఇవ్వు" అని తీర్పు ఇచ్చాడు.

నీతి : ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది. అబద్ధం ఓడిపోతుంది.


కాకి - గేదె (06/07/2011)

అది వేసవికాలం. ఎండలు విపరీతంగా మండుతున్నారుు. ఓ చెట్టు నీడలో ఒక గేదె సేదతీరుతోంది. అది తన కళ్లను సగం వుూసుకొని, ఆహారాన్ని నెవురువేస్తోంది. ఇంతలో ఆ చెట్టు మీద ఒక కాకి వాలింది. ఎండ తీవ్రంగా ఉండటం వల్ల చెట్టు మీద కూడా కాస్త వేడిగానే ఉంది. చెట్టు కింద చల్లగా ఉందని ఆ కాకి నేల మీద వాలింది. వురీ నేల మీద ఎందుకులే అని, అక్కడ నుండి ఎగిరి గేదె కొవుు్మల మీద వాలింది. ఆ గేదె కాకిని అసలు పట్టించుకోకుండా అలానే కూర్చుంది. కాకి అలా ఆ గేదె కొవుు్మల మీద కాసేపు సేదతీరింది. ఇక ఎగిరి వెళదావునుకున్న సమయంలో, కాకి తన వునసులో ఇలా అనుకుంది.

‘పిచ్చి గేదె! నేను ఇంత సేపు దీని కొవుు్మల మీద కూర్చుని సేద తీరాను. దీనికి తెలియును కూడా తెలియలేదు. అంటే నేను ఈ గేదె గుర్తించలేనంత చాకచక్యంగా కూర్చున్నాను. దీనికి తెలియుకుండా నేను దీన్ని తెలివిగా వాడుకున్నాను.’ అని కాకి తన తెలివికి తనే వుురిసిపోరుుంది.
గేదె కొవుు్మల మీద నుంచి ఎగిరి, గేదె వుుందు గర్వంగా వాలింది. ‘‘నేను ఇప్పుడు వెళ్లవచ్చా?అని ఎగతాళిగా గేదెను అడిగింది.

‘‘నీలాంటి అల్పప్రాణులు నా మీద వాలి సేద తీరి వెళ్లడం నేనసలు పట్టించుకోను. ఒకవేళ నువ్వు నా మీద ఇంత సేపటి వరకు సేద తీరినందుకు నాకు కృతజ్ఞతలు తెలిపి ఉంటే నా దృష్టిలో నీ స్థారుు పెరిగేది’’ అని బదులిచ్చింది ఆ గేదె. దీంతో కాకి గర్వం పటాపంచలరుు్యంది. సిగ్గుతో తల దించుకొని వూరువూట్లాడకుండా అక్కడి నుండి ఎగిరి వెళ్లిపోరుుంది.

నీతి: అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఎదుటివారిని తక్కువ అంచనా వేసి చులకన చేయకూడదు


దురాశకు పోతే దుఃఖం (02/07/2011)

ఒకసారి ఒక సాధు పుంగవుడు తన శిష్యులందరి పట్ల సంతుష్టుడై ‘మీకు అమోఘమైన ఒక మంత్రం ఉపదేశిస్తాను. దాన్ని సక్రమంగా ఉపయోగించుకుని జీవితాన్ని సంతోషంగా గడపండి’ అని ఒక మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని చదివి మీకేం కావాలంటే అది కోరుకోండి అది జరుగుతుంది. ఒక్కసారి మాత్రమే. దీన్ని దుర్వినియోగం చేయకండి’‘ అని చెప్పాడు. ఆ శిష్యులలో ఆశారాం అనేవాడు అసంతృప్తితో ‘స్వామీ ఇంతకాలంనుంచి మిమ్ము సేవించుకున్నాను. ఒక్క మంత్రమేనా ఉపదేశించేది?’ రెండింటిని కోరుకునేలా నాకు ఇంకో మంత్రం ఉపదేశించండి’ అని అడిగాడు. అందరు శిష్యులు ఇచ్చినదానితో తృప్తి పడితే వీనికి ఆశ ఎక్కువగా ఉంది అనుకుని ఆ సాధువు ‘అందరికీ సమానంగా మంత్రం ఉపదేశించా, నీకు ఆశ పనికిరాదు, దొరికిన దానితో తృప్తిపడాలి’ అని హితవు చెప్పాడు. కానీ ఆశారాం వినకుండా తనకు ఇంకో మంత్రం ఉపదేశించాల్సిందే అని పట్టుపట్టాడు.
దానికా సాధువు సరేనని కోరుకున్నది జరిగేట్టు ఇంకో మంత్రం ఉపదేశించి పంపాడు. ఇంటికి వెళ్లాక ఆశారాం ‘నా ఇల్లేమిటి ఇలా దరిద్రంగా ఉంది..వట్టి మట్టికొంప, దీన్ని బంగారు ఇల్లుగా మార్చుకుంటే ఎంత బాగుంటుందో’ అనే ఆలోచన వచ్చి సాధువుచెప్పిన మొదటి మంత్రం చదివి ‘నా ఇల్లు బంగారంగాను’ (బంగారు ఇల్లు అవ్వాలని) కోరుకున్నాడు. అతని ఆశ్చర్యానికి అంతులేదు! ఇంట్లో వస్తువులతో సహా ఇల్లంతా బంగారమై మెరిసిపోతోంది. తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. ఇప్పుడు తానెంతో ధనవంతుడనని, తనకెవరూ సాటిరారని గర్వపడ్డాడు...‘ ఇలా బంగారపు ఇంట్లో బంగారు వస్తువులతో జనం మధ్యలో వుంటే అందరి కళ్లూ నామీదే ఉంటాయి. దాంతో దొంగలు దోపిడీదారులు నా ఇంటిపై కనే్నస్తారు..ఇదంతా అపహరించుకోవడానికి’ అనే భయం పట్టుకుంది. ఏం చెయ్యాలా?’ అని ఆలోచిస్తుంటే సాధువుగారు ఉపదేశించిన రెండో మంత్రముందిగా నా దగ్గర అనుకుని ఆ మంత్రం పఠించి ‘నా బంగారం నాకే కాక ఇతరులకు కనపడకుండుగాక’ అని కోరుకున్నాడు. ఇప్పడు ఆ బంగారు ఇల్లు, అందులో వస్తువులు ఆశారాంకు తప్ప ఇతరులకెవ్వరికీ కనపడడంలేదు. చుట్టుపక్కలవాళ్లు గుసగుసలాడుకుంటున్నారు. ఆశ్చర్యపడుతున్నారు. ఆశారాం కనపడుతున్నాడు, కానీ ఇల్లేమైంది. వట్టి ఖాళీ జాగాలో ఉంటున్నాడేమిటో?’అని!
ఒకరోజు ఆశారాం తనవద్దనున్న బంగారంలో కొంత అమ్మాలనుకున్నాడు. రోజువారీ ఖర్చులకోసం డబ్బు కావాలి కదా! కొంత బంగారం పట్టుకుని బంగారం వ్యాపారి దగ్గరకు వెళ్లాడు ఆశారాం. తను కోరుకున్న రెండో వరం..తన బంగారం తనకేగానీ ఇతరుల కంటికి కనపడకుండా వుండాలన్నది మరిచిపోయాడు. వ్యాపారి వద్దకు పోయి ‘ఈ బంగారానికి ధరకట్టి డబ్బులియ్యండి’ అని బంగారం చూపించాడు. ఆ బంగారం తనకే గానీ వాళ్లకు కనపడదు కదా! దానికా వ్యాపారి ‘‘ఏమీ ఇవ్వకుండా బంగారం తీసుకుని డబ్బియ్యమంటావేమిటి? ననే్న మోసం చేద్దామనుకుంటున్నావా?’’ అని కేకలేశాడు. దాంతో ఆశారాం పక్కనున్న వారిని ‘‘చూడండయ్యా, నేను బంగారం ఇస్తుంటే ఏమీ లేదంటున్నాడీయన, ఇదేంటి, ఇది బంగారం కాదా? చూడండి’’ అంటూ చేతిలోని బంగారం చూపిస్తున్నాడు అందరికీ. ఆ బంగారం అతనికి తప్ప ఎవరికీ కనపడడంలేదు. అందుకని అందరూ ‘‘ పోవయ్యా వట్టి చేతులు చూపిస్తూ బంగారం ఉందంటున్నావు అందరికీ చెవిలో పువ్వులు పెడతావా? ఏది బంగారం! నీకేమన్నా పిచ్చా’’ అని ఆశారాం మాటలు ఎవరూ నమ్మలేదు. పైగా ‘పిచ్చివాడు’ అని అందరూ నవ్వడం మొదలుపెట్టి, పోరా పోరా పిచ్చోడా! అంటూ తన్ని తరిమివేశారు. పాపం! ఆశారాం ఆశపడి ఇంటిని బంగారం చేసుకున్నాడు. కానీ దురాశ అతడిని అన్నింటికీ దూరం చేసి పిచ్చివానిగా ముద్రవేసింది. ఇంటికే కాదు ఊరికీ దూరమయ్యాడు!
చూశారా! తృప్తిలో వున్నంత సుఖం ఎందులోనూ ఉండదు. ఆశ ఉండచ్చు. కానీ తగిన మోతాదులో ఉండాలి . మోతాదు మించి మొత్తానికే మోసం దుఃఖానే్న మిగుల్చుతుంది.


సమయస్ఫూర్తి (02/07/2011)

విదర్భపురాన్ని జయేంద్రుడు అనే రాజు పరిపాలించేవాడు. ఒకరోజు ఆ రాజు నిద్రిస్తున్న సమయంలో ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో అతని నోటి పళ్ళన్నీ ఊడిపోయి, ఒక పన్ను మాత్రమే మిగిలింది. మెలకువ వచ్చిన జయేంద్రుడు ఆ కలకు అర్థం ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. మరునాడు కలలకు అర్థం చెప్పగలిగే జ్యోతిష్యులను పిలిపించమని సభలో మంత్రు లను ఆదేశించాడు.

రెండు రోజుల తరువాత ఇద్దరు ప్రముఖ జ్యోతిష్యులు రాజసభకు వచ్చారు. జయేంద్రుడు తన కల చెప్పి దానికి అర్థం ఏమిటో వివరించమని అడిగాడు. జ్యోతిష్యులు తమ దగ్గరున్న తాళపత్ర గ్రంథాలు చదివి, వేళ్ళ మీద చాలాసేపు లెక్కించారు.

తరువాత ఒక జ్యోతిష్యుడు ‘‘రాజా! మీ సన్నిహితులు, బంధువులు అందరూ మీకంటే చాలా ముందుగా చనిపోతారు’’ అన్నాడు. అతను చెప్పింది అక్షరాలా నిజం. శాస్త్రం అదే చెబుతోంది.
కానీ అది వినగానే జయేంద్రుడికి కోపం వచ్చింది. ఆ మాటలు ఎంతో కఠినంగా తోచాయి. భటులను పిలిచి, జ్యోతిష్యుడిని బంధించమని ఆజ్ఞాపించాడు. ఇంతలో రెండో జ్యోతిష్యుడు కల్పించుకుని, ‘‘ప్రభూ! అందరికంటే మీరు ఎక్కువ సంవత్సరాలు జీవించి రాజ్యాన్ని పరిపాలిస్తారని మీ కల చెబుతోంది. మీ సన్నిహితులు, బంధువులకంటే మీ ఆయుష్షు ఎక్కువని దీని అర్థం. అతను కూడా అదే చెప్పాడు ప్రభూ’’ అన్నాడు.

రెండో జ్యోతిష్యుడి మాటలు విని జయేంద్రుడి కోపం తగ్గింది. ‘‘మరి ఆ మాటే సరిగ్గా చెప్పవచ్చు కదా!’’ అని ఆ జ్యోతిష్యుడిని వదిలిపెట్టమని భటులకు చెప్పాడు.
రాజప్రసాదం నుండి బయటపడ్డాక తన ప్రాణాలు కాపాడినందుకు మొదటి జ్యోతిష్యుడు రెండో వ్యక్తితో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

‘‘ఫరవాలేదు మిత్రమా! కానీ ఒక విషయం నువ్వు గుర్తుంచుకో. ఎదుటివారికి రుచించని విషయాలు, చెడు సంగతులు చెప్పాల్సి వచ్చినప్పుడు వాటిని సూటిగా చెప్పకూడదు. నర్మగర్భంగా, డొంకతిరుగుడుగా వాళ్ళకు అర్థమయీ కానట్టుగా చెప్పాలి’’ అని సలహా ఇచ్చాడు రెండో జ్యోతిష్యుడు.

నీతి: ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసి ప్రవర్తించాలి.


బీర్బల్ తెలివి (02/07/2011)

ఒకరోజు అక్బరు చక్రవర్తి, మంత్రి బీర్బల్ పచ్చికబయళ్లలో నడుస్తున్నారు. అక్కడ ఒక గొర్రెలకాపరి చక్రవర్తికి చెందిన గొర్రెలను మేపుతున్నాడు. అక్బరు ఆ గొర్రెలు సన్నగా ఉండటం గమనించాడు.

‘‘ఏమోయ్! నువ్వు గొర్రెలను సరిగ్గా మేపటం లేదు. ఇలాగయితే నీకు శిక్ష తప్పదు’’ అని గొర్రెలకాపరితో కోపంగా అన్నాడు అక్బరు.

కాపరి భయంతో వణికిపోయాడు. తనను రక్షించమన్నట్టు దీనంగా బీర్బల్ వైపు చూశాడు.
బీర్బల్ కల్పించుకుని ‘‘ప్రభూ! మనుషులైనా పశువులైనా ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. అది వారి వారి శరీరతత్త్వంపై ఆధారపడి ఉంటుంది’’ అన్నాడు.

అక్బరు కోపం రెట్టింపయ్యింది. ‘‘నా మాటను ఖండించడం నీకు అలవాటైపోయింది. మనుషులకు, గొర్రెలకు పోలికేమిటి? సరే, ఒక గొర్రెను మనతో తీసుకువెళ్ళి కడుపునిండా గడ్డి పెడదాం. అప్పుడు చూద్దాం గొర్రె లావెక్కుందో లేదో’’ అన్నాడు.

గొర్రెల కాపరిని రక్షించబోయి బీర్బల్ తను ఇరుక్కున్నాడు. ఆ ఆపదలోంచి బయటపడే మార్గం గురించి ఆలోచిస్తూ ఒక గొర్రెను తీసుకుని చక్రవర్తిని అనుసరించాడు.

అక్బరు ఆ గొర్రెను ఒక సేవకుడికి అప్పగించి దానికి బాగా గడ్డి తినిపించమని చెప్పాడు. సేవకుడు పగలంతా గొర్రెను కనిపెట్టుకుని ఉండి మామూలుగా అది తినేదానికంటే రెట్టింపు గడ్డిని తినిపించసాగాడు. రాత్రిపూట దాన్ని ఒక కొట్టంలో వదిలేసివెళ్లిపోయేవాడు. బీర్బల్ బాగా ఆలోచించి ఆ గొర్రె ఉండే కొట్టంలో రాత్రిపూట ఉండేలా ఒక కసాయిని నియమించాడు. అతను చేయాల్సిన పని గొర్రెకు కనబడేలా కత్తిని నూరుతూ ఉండటమే.

కసాయి కత్తిని చూసి గొర్రె చాలా భయపడింది. దానికి రాత్రిపూట కంటి మీద కునుకు లేకుండా పోయింది. దాంతో తిన్న తిండి ఒంటబట్టక మరింతగా బక్కచిక్కిపోయింది. కొన్ని రోజుల తరువాత అక్బరు వచ్చి గొర్రెను చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు బీర్బల్ ఆయనతో ఉన్నాడు.
‘‘నువ్వు చెప్పింది నిజమే బీర్బల్. కానీ... నేనెందుకో నీ మాటతో పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను. అంత తిండి తిన్న గొర్రె లావెక్కకపోవడం ఏమిటి?’’ అని అడిగాడు.

‘‘ఏమీ లేదు ప్రభూ, మనుషులైనా జంతువులైనా లావెక్కకపోవడానికి కారణం భయం’’ అంటూ తను కసాయిని నియమించిన విషయాన్ని వివరించాడు.
అక్బరు మెచ్చుకోలుగా బీర్బల్ భుజం తట్టాడు.


సీతాకోకచిలుక గర్వం (02/07/2011)

ఒక గులాబి తోటలో ఒక సీతాకోక చిలుక ఉండేది. అది రంగురంగుల రెక్కలతో చూడటానికి ఎంతో అందంగా ఉండేది. తన అందం పట్ల దానికి ఎంతో గర్వం, ఆ గర్వంతో పాటు కొంచెం మూర్ఖత్వం కూడా ఉండేది.

ఒకరోజు ఒక ఏనుగుపిల్ల ఆ తోటకు వచ్చింది. సీతోకోకచిలుక రివ్వున ఎగిరి దాని చెవి మీద వాలింది.

‘‘నా చెవి మీద ఎవరున్నారు?’’ అని అడిగింది ఏనుగు.
‘‘హలో! నీకు నేనెవరో తెలియదా? ఈ ప్రపంచంలో చాలా అందంగా ఉండే ఏకైక జీవిని నేనే. సీతాకోకచిలుకను’’ అన్నది ఎంతో గర్వంగా.
‘‘అవునా! నిన్ను కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు?’’ అని అడిగింది ఏనుగు.

‘‘నేను ఎక్కడికైనా వెళ్ళగలను. తూర్పునుండి పడమరకు, పడమర నుండి తూర్పుకు ఎగిరి వెళ్ళగలను. నువ్వు నాలా ఎగురగలవా?’’ కొంటెగా అన్నది సీతాకోకచిలుక.
‘‘ఊహూ, ఎగురలేను’’ అన్నది ఏనుగు బాధగా.
‘‘చూసావా? మరి నేను నీకంటే గొప్పదాన్నన్నమాట. అవునా?’’ అని అడిగింది సీతాకోకచిలుక.

‘‘అవును. గొప్పదానివే’’ అని ఒప్పుకుంది ఏనుగు.

సీతాకోకచిలుకకు పట్టరాని సంతోషం కలిగింది. ‘‘ఒకరకంగా మనమిద్దరం ఒకటే తెలుసా? నీకు తొండం ఉంది. నాకు తొండం ఉంది. అయితే నా తొండంతో నేను పూల మకరందాన్ని తీయగలను. నువ్వు తీయలేవు. కాబట్టి నేను నీకంటే గొప్ప’’ అన్నది సీతాకోక చిలుక మరింత బడాయిగా.

‘‘నిజమే’’ అంది ఏనుగు.

‘‘నీకెన్ని కాళ్లున్నాయి?’’ అని అడిగింది సీతాకోకచిలుక. ‘నాలుగు’ అని చెప్పింది ఏనుగు. ‘‘ఇందులో కూడా నేనే గొప్ప. నాకు ఆరు కాళ్ళున్నాయి’’ అంది. ఇంతలో పెద్ద గాలి వీచింది. ఆ గాలి వేగానికి సీతాకోకచిలుక పట్టుతప్పి ఎగిరిపోసాగింది. ‘‘అయ్యో! నన్ను కాపాడండి... కాపాడండి’’ అని గట్టిగా కేకలు వేసింది.

అది విన్న ఏనుగు వెంటనే తొండంతో సీతాకోకచిలుకను పట్టుకుంది. గండం గడిచిందని ఊపిరి పీల్చుకున్న సీతాకోకచిలుకకు, ఆ సంఘటనతో బుద్ధి వచ్చింది. గొప్పలు చెప్పుకోవడం మానేసింది.


యోగ్యత (29/06/2011)

వంతీపురాన్ని పరిపాలించే చంద్రసేన మహారాజు మంచి సమర్థుడు. యోగ్యుడు. ప్రజలను తన కన్నబిడ్డల్లా ఎలాంటి కష్టనష్టాలు ఈతిబాధలు లేకుండా ప్రజానురంజకంగా పరిపాలన కొనసాగిస్తున్నాడు. అతని పరిపాలనను ప్రజలు రామరాజ్యంగా కొనియాడుతూ ఉండేవారు. అయితే మహారాజుకు ఒక్కగానొక్క కూతురు అవంతిక. ఆమె సౌందర్యవతిగానే కాక విద్యా వినయ సంపన్నురాలిగా పేరు తెచ్చుకుంది. మహారాజుకు పురుష సంతానం లేదు. కాబోయే అల్లునికి రాజ్యాన్ని అప్పగించి వారసునిగా ప్రకటించాలని మహారాజు ఆలోచన. అయితే అందుకు తగిన అర్హతలుకల వ్యక్తి ఎవరు అనేది ప్రశ్న. అందుకు అనేకమంది రాజకుమారులు పోటీలో ఉన్నారు. మహారాజు అనుమతిస్తే లేదా స్వయంవరం ప్రకటిస్తే రాజ్యలక్ష్మిని, రాకుమారిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అన్ని యోగ్యతలుకల వ్యక్తిని రాజుగా నియమించాలని, అయితే అతను సాధారణ పౌరుడైనా పర్వాలేదని అనేది మహారాజు ఆలోచన. అందుకోసం దేశాటనం చేసి తగిన వ్యక్తిని నిర్ణయించాలని రాజ్యాన్ని మంత్రికి అప్పగించి గుర్రంపై ఒంటరిగా బయలుదేరాడు. మహారాజు వేషంలో ఉంటే ఎవరెలాంటివారో బయటపడకపోవచ్చని మారువేషంలో బయలుదేరాడు.
అడవిలో కొంత దూరం ప్రయాణం సాగించిన మహారాజు కొద్దిసేపు విశ్రాంతి కోసం ఓ చెట్టుకింద నడుం వాల్చాడు. మాగన్నుగా నిద్రకు ఉపక్రమించబోతున్న రాజు ఆ చెట్టుపైనే విశ్రాంతి తీసుకుంటున్న చిరుతను గమనించలేదు. ఎప్పటినుండో ఆకలితో నకనక లాడుతున్న ఆ మృగం వెంటనే నరవాసనను పసిగట్టింది. మహారాజుపై విరుచుకుపడింది. అది ఊహించని మహారాజు ఒరలోనుండి కత్తి దూసేలోపే అది తన పంజాదెబ్బ కొట్టింది. దాంతో కిందపడ్డ రాజు ‘ఈరోజుతో తన పని ఆఖరు’ అనుకున్నాడు. ఇంతలో అటుగా వెడుతున్న ఓ యువకుడు మెరుపులా లంఘించి తన కత్తితో చిరుతను ఎదుర్కొంటూ చివరకు పొడిచి చంపేసాడు. రాజుకు నీరు తాగించి కొద్దిసేపు సేద తీర్చాడు. కొంతసేపటికి రాజు కృతజ్ఞతగా ఆ యువకుడి వైపు చూస్తూ ‘‘ఎవరు నువ్వు? ఇంత సాహసం నీకెలా అబ్బింది?’’ అని ప్రశ్నించాడు. పక్కవూరు నుండి వస్తున్నాను. నా పేరు విక్రముడు. మా తండ్రి పక్క వూరిలో ఓ చిన్న వ్యాపారి. నా విద్యాభ్యాసం ఈ మధ్యనే పూర్తయింది. అర్హతకు తగిన ఉద్యోగానే్వషణలో బయలుదేరాను. కత్తిసాము కూడా నేర్చుకున్నాను. అందుకే చిరుత మీ మీదకు దూకడం చూసి వెంటనే దాన్ని పడగొట్టాను. ఇంతకీ మీరెవరు? ఎక్కడకు వెడుతున్నారు? అని ప్రశ్నించాడు విక్రముడు. తాను ఈ దేశానికి రాజుననే విషయం బయటపడకుండా రాజు అతనితో ముచ్చటిస్తూ నడక సాగించాడు. కొద్ది దూరం వెళ్లాక ఓ చెట్టుకింద అనేక పావురాలు వలలో చిక్కుకుని బయటపడలేక గగ్గోలు పెడుతున్నాయి. వెంటనే విక్రముడు తన కత్తితో ఆ వల తాళ్లను కత్తిరించాడు. పక్షులు ఆనందంతో అరుస్తూ ఒక్కసారిగా ఎగిరిపోయాయి. అది చూసిన మహారాజు ఆశ్చర్యంతో ‘ఏమిటి నువ్వు చేసిన పని, వేటగాడి నోటి ముందు ఆహారాన్ని తీసేసావు తప్పుకదా!’ అని అడిగాడు. అందుకు విక్రముడు, మీ ఆలోచన సరికాదు. ఇక్కడ ఆపదలో ఉన్నది పావురాళ్లు. వేటగాడు మరేవిధంగానైనా ఆహారాన్ని సంపాదించుకోగలడు. ఆ నోరులేని జీవులను రక్షించడం నా కర్తవ్యం. అందుకే వలతాళ్లు తెంపేసానంటూ జవాబిచ్చాడు. అతని ధర్మ సూక్ష్మానికి మనసులోనే అభినందించాడు మహారాజు. మరికొంత దూరం వెళ్లిన వారిద్దరికి ఏనుగుల ఘీంకారాలు వినిపించాయి. చూడగా లోతుగా వున్న గుంటలో రెండు ఏనుగు పిల్లలు చిక్కుకుని బయటకు రాలేక అరుస్తున్నాయి. వాటి తల్లి ఒడ్డుపైనుండి వాటిని కాపాడలేక గంగవెర్రులెత్తుతోంది. దగ్గరగా వెళ్తే ఏమన్నా చేస్తుందేమోనని మహారాజు సంకోచిస్తుంటే విక్రముడు ధైర్యంతో దాని వీపు నిమురుతూ బుజ్జగిస్తూ నమ్మకాన్ని కలిగించాడు. చెట్ల ఆకులను, కొమ్మలను తెంపుకొచ్చి గుంతలో వాలుగా పేర్చినట్టు పడేసాడు. వాటిపైనుండి ఏనుగు పిల్లలు రెండూ పైకి వచ్చేసాయి. తొండాన్నిపైకెత్తి అతనికి తమ కృతజ్ఞతను తెలియజేసి వాటి దారిన అవి అడవిలోకి వెళ్లిపోయాయి. ఇదంతా దూరం నుండి గమనించిన రాజుకు చాలా ఆశ్చర్యం వేసింది. పిల్లలను కాపాడడం కోసం తల్లిని మచ్చిక చేసుకున్న అతని సమయస్ఫూర్తి చాలా అబ్బురపరిచింది. మనసులో ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు రాజు, ‘విక్రముడే తనకు కాబోయే అల్లుడని, రాజ్యానికి మహారాజని, చిరుతను చంపడంలో అతని సాహసం, పావురాళ్లను కాపాడడంలో అతని ధర్మసూక్ష్మం, ఏనుగులను కాపాడడంలో అతని దయా హృదయం, సమయస్ఫూర్తి రాజును ముగ్ధుడిని చేశాయ. అంతట రాజు, ఉద్యోగానే్వషణకు బయలుదేరిన అతనికి తానెవరో వివరించి, ‘నీకు అభ్యంతరం లేకపోతే నా కూతురిని, నా రాజ్యాన్ని స్వీకరించమని కోరాడు. అప్పటికే అవంతిక గురించి విన్న విక్రముడు మనస్ఫూర్తిగా దీనికి అంగీకరించాడు. సమర్థుడైన విక్రముడి పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు.


ఆలోచనా సరళి (29/06/2011)

కాశీనాథ్ అనే పేద యువకుడు ఒకసారి అడవి మార్గంలో ప్రయాణిస్తున్నాడు. అతను విష్ణుభక్తుడు. అతనికి మార్గమధ్యంలో ఒక సాధువు కలిశాడు.

‘‘ఏం నాయనా! ఒంటరిగా అడవిలో ఎక్కడికి వెళుతున్నావు?’’ అని ప్రశ్నించాడు సాధువు.
‘‘పని వెతుక్కోవడానికి పట్నం వెళుతున్నాను స్వామీ! ఇది దగ్గరదారి కదా అని ఇలా వచ్చాను’’ అని ఎంతో వినయంగా సమాధానం చెప్పాడు.

ఇద్దరూ కలిసి నడక సాగించారు. కొంతదూరం ప్రయాణించాక అలసిపోయారు. కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద ఆగారు. వాళ్ళకు కొద్దిదూరంలో ఒక నక్క కనిపించింది. దాని కాలికి గాయం కావడంతో నడవలేక కుంటుతోంది.

‘‘ఆ నక్కను చూశారా స్వామీ! పాపం నడవలేకపోతోంది. మనుషులం మనం ఇంత కష్టపడితేగానీ పొట్ట నిండటం లేదు. మరి వేటాడలేని ఈ నక్క పొట్ట ఎలా నిండుతుంది’’ అన్నాడు కాశీనాథ్ ఎంతో జాలిగా.

సాధువు జవాబు చెప్పలేదు. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఇంతలో హఠాత్తుగా అంతవరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో కలకలం మొదలైంది. పక్షులు గోలగోల చేస్తూ అటుఇటు ఎగరసాగాయి. ఉడుతలు గబగబా చెట్టెక్కాయి. కుందేళ్ళు బొరియల్లోకి పారిపోయాయి.
‘‘ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నట్టుంది. పద ఈ చెట్టెక్కుదాం’’ అని సాధువు చెప్పడంతో కాశీనాథ్ ఆయన్ని అనుసరించాడు. ఇద్దరూ ఒక పెద్ద చెట్టు ఎక్కి గుబురుకొమ్మల్లో దాక్కున్నారు.
ఒక సింహం తను వేటాడిన జంతువును ఆ చెట్టు కిందకు ఈడ్చుకు వచ్చింది. తను తినగలిగినంత తిని మిగతాది అక్కడే వదిలి వెళ్ళిపోయింది. సింహం అటు వెళ్ళగానే నక్క వచ్చి సింహం వదిలి వెళ్ళిన ఆహారం తినసాగింది.

ఇదంతా చెట్టు మీద నుంచి చూస్తున్న కాశీనాథ్, ‘‘చూశారా స్వామీ! భగవంతుడికి ఎంత పక్షపాతమో! నేను చిన్నప్పటినుంచి ఆ ఏడుకొండలవాడిని సేవిస్తూ వస్తున్నాను. నేనెన్ని కష్టాలలో ఉన్నా ఏ రోజూ దేవుడు నాకు సహాయం చేయలేదు. ఆ నక్క ఒక్కసారి కూడా భగవంతుడిని పూజించి ఉండదు. అయినా దానిని కష్టకాలంలో ఆదుకున్నాడు’’ అన్నాడు కించిత్తు నిరసనగా.
సాధువు మళ్ళీ నవ్వాడు. ‘‘నాయనా! నువ్వు ఒక కోణంలోంచే ఆలోచిస్తూ నిస్సహాయురాలైన నక్కతో నిన్ను పోల్చుకుంటున్నావు. భగవంతుడు అన్ని అవయవాలు సరిగ్గా ఇచ్చి నిన్ను బలవంతుడిని చేశాడు. అంటే సింహంలా కష్టపడి నీ ఆహారాన్ని నువ్వు సంపాదించుకోగలవు. నువ్వు తినగా మిగిలినది ఇతరులకు దానం చెయ్యగలవు. అంతటి శక్తిసామర్థ్యాలు భగవంతుడు నీకు ఇచ్చాడు. అంతేకాని ఎవరిమీదైనా ఆధారపడి తినడానికి నువ్వు కుంటినక్కవు కాదు’’ అని చెప్పాడు. దాంతో కాశీనాథ్ తను ఆలోచించిన పద్ధతికి సిగ్గుపడ్డాడు.


వ్యాపార వారసుడు (29/06/2011)

ఒక ఊళ్ళో ఒక వర్తకుడు ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు. ఆ వర్తకుడికి ముగ్గురు కొడుకులు. తనకు వయసు మీద పడుతుండడంతో తన వ్యాపారలావాదేవీలను కొడుకులకు అప్పగించాలి అనుకున్నాడు వర్తకుడు. తన కొడుకులలో అందుకు సమర్థుడు ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు.

ఒకరోజు ముగ్గురు కొడుకులనూ పిలిచి, ‘‘అబ్బాయిలూ! ఈ ఆస్తిపాస్తులన్నీ మీవే. నా తరువాత వాటిని ఎవరికో ఒకరికి అప్పగిస్తాను. నేను ఆరునెలలపాటు తీర్థయాత్రలకు వెళ్తున్నాను. మీకు తలా కొంత ధనం ఇస్తాను. వాటిని మీకు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చుచేయండి’’ అని చెప్పాడు. తన దగ్గర సిద్ధం చేసుకుని ఉన్న బంగారు కాసుల్లోంచి పెద్దవాడికి మూడు వాటాలు, రెండో వాడికి రెండు వాటాలు, చిన్నవాడికి ఒక వాటా ఇచ్చాడు.

పెద్దవాడు తండ్రి తనకు మూడు వాటాలు ఇవ్వడంతో చాలా సంతోషించాడు. ‘నాన్నకు నేనంటే చాలా ఇష్టం. ఆస్తంతా నాకే అప్పగిస్తాడనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఇంకేం కావాలి?’ అనుకున్నాడు. తండ్రి నమ్మకాన్ని నిలబెట్టాలని తన ఖర్చులన్నీ తగ్గించుకుని, ఒక్క బంగారు కాసు కూడా ఖర్చు చేయకుండా సాదాసీదాగా బతకసాగాడు.

రెండోవాడు ‘తండ్రి ఎలాగూ నాకు ఆస్తి నిర్వహణ బాధ్యత అప్పగించడు. బంగారు కాసులు పంచడంలోనే అతని ఉద్దేశ్యం అర్థమైంది. ఇక వేరే ఆలోచన ఎందుకు? నా వంతుకు ఏం వస్తే అది తీసుకుని సంతోషంగా ఉండాలి’ అనుకుని తన దగ్గరున్న ధనాన్ని విలాసాల కోసం ఖర్చు చేయసాగాడు. మూడోవాడు అన్నయ్యలిద్దరి కంటే భిన్నమైనవాడు. ‘చిన్న వాడిని కాబట్టి నాకెప్పుడూ తక్కువ భాగమే వస్తుంది. నేనేంటో రుజువు చేసి చూపిస్తాను’ అనుకున్నాడు. ఆరునెలల గడిచాక తండ్రి తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చాడు. కొడుకులను పిలిచి తను ఇచ్చిన ధనాన్ని ఏ విధంగా ఖర్చు చేశారో చెప్పమని అడిగాడు.

పెద్దవాడు ‘‘నాన్నా! నేను ఒక్క కాసు కూడా తీయలేదు. నా అవసరాలు తగ్గించుకుని మీరిచ్చిన ధనాన్ని అలాగే జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను’’ అన్నాడు గర్వంగా.
తండ్రి పెదవి విరిచాడు. ‘‘ఏం లాభం? నువ్వు తినలేదు. ఇతరులను తిననివ్వలేదు’’ అని రెండో కొడుకు వైపు చూశాడు.

‘‘మీరు చెప్పింది నిజమే నాన్నా! నేనయితే ఒక్క కాసుకూడా మిగల్చకుండా అన్నీ ఖర్చు చేసేశాను’’ అని చెప్పాడు రెండోవాడు.

ఇక మూడోవాడి వంతు వచ్చింది. అతను తండ్రి ఇచ్చిన దానికి రెండురెట్లు ఎక్కువ ధనాన్ని ఆయన ముందుంచి, ‘‘నాన్నా! నేను వ్యాపారం చేశాను. మొదటి నెల లాభాలు వచ్చాయి. లాభాన్ని పెట్టుబడిగా పెడుతూ వచ్చాను. చివరకు ఇంత సంపాదించగలిగాను’’ అన్నాడు.
తండ్రి ముఖంలో సంతోషం కనిపించింది. వ్యాపార దక్షత కలిగిన చిన్న కొడుకుకే తన వ్యాపారాన్ని అప్పగించాడు.


షవర్ బాత్ స్నేహితులు (22/06/2011)

ఒక అడవిలో ఒక ఏగునుల గుంపు ఉండేది. ఆ గుంపులో నిక్కి అనే ఒక ఏనుగు పిల్ల ఉండేది. ఆ గుంపులో అదొక్కటే పిల్ల ఏనుగు కావడంతో దానికి ఆడుకోవడానికి స్నేహితులు ఉండేవి కాదు. అది పేరుకు పిల్ల ఏనుగే కానీ ఆ అడవిలో ఉండే మిగతా అన్ని జంతువుల కంటే ఎత్తుగా, లావుగా ఉండేది. నిక్కికి స్నేహితులు లేకపోవడంతో ఒంటరితనంతో బాధపడేది. ఒకరోజు దానికి ఆ అడవిలో ఉన్న మిగతా జంతువుల పిల్లలు ఆడుకోవడం కనిపించింది. వెంటనే వాటి దగ్గరకు వెళ్లింది.

‘‘హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నిక్కి. నేను కూడా మీతో ఆడతాను. నన్నూ మీ జట్టులోకి చేర్చుకోరా?’’ అని వాటిని అడిగింది నిక్కి.

‘‘అమ్మో! నువ్వు చూడు ఎంత భయంకరంగా ఉన్నావో, నీ కాళ్ళ కిందపడితే మేము చచ్చిపోతాం’’ అంది కుందేలు.

‘‘అయినా నువ్వు మాతో ఏ ఆట ఆడగలవు? ఒంటికాలి మీద గెంతగలవా? దాగుడుమూతలు ఆడగలవా? చెట్టెక్కి ఊగగలవా? ఇంత పెద్ద శరీరంతో నువ్వు ఏ ఆట ఆడగలవు చెప్పు,’’ అంటూ కిచా కిచా నవ్వింది కోతి.

అది విని మిగతా జంతువులు ఎగతాళిగా నవ్వాయి. నిక్కికి బాధ కలిగింది. అయినా వాటి మాటల్లో నిజం లేకపోలేదు. తనకు ఒంటికాలి మీద గెంతడం రాదు. చెట్లెక్కడం అంతకన్నా రాదు. పాపం నిక్కి దూరంగా కూర్చుని వాళ్ళు ఆడుకునే ఆటలను చూస్తూ సంతోషించింది.
అది ఎండాకాలం... ఒకరోజు కోతి, కుందేలు, సింహం పిల్లలు కలిసి చాలాసేపు ఆడుకున్నాయి. తరువాత వాటికి దాహం వేసి చెరువు దగ్గరకు వెళ్లాయి. అప్పటికే నిక్కి అక్కడ ఉంది. చెరువులో నిలబడి తొండంలో నీళ్ళు నింపుకుని తన మీద చిలకరించుకుంటోంది.

‘‘ఏయ్ ఆ నిక్కిని చూడండి! ఎంత చక్కగా స్నానం చేస్తోందో!’’ అంటూ గట్టిగా అరిచింది కోతి.
‘‘ఎంచక్కా షవర్‌బాత్ చేస్తోంది. అలా నీళ్ళలో తడుస్తుంటే చాలా బావుంటుంది.’’ అంది సింహం పిల్ల.

నెమ్మదిగా అవన్నీ నిక్కి దగ్గరకు పరుగెత్తాయి. ‘‘నిక్కీ! నిక్కీ! మా మీద కూడా అలా నీళ్ళు పోయవా?’’ అంటూ అడిగాయి. నిక్కి తొండంతో వాటి మీద నీళ్ళు చిలకరించింది. ఆ నీళ్ళలో తడిసిపోతూ అన్నీ కేరింతలు కొట్టాయి.
‘‘మనకి ఈ ఆట ఆడటం రాదు. ఒక్క నిక్కీకే వచ్చు’’ అంది కుందేలు పిల్ల. ఆ మాట విని మిగిలిన పిల్లలన్నీ అవునంటూ ఒప్పుకున్నాయి.
‘‘నిక్కీ! మనం రేపు ఇక్కడే ఈ ఆట ఆడుకుందామా? మా జట్టులో కలుస్తావా? ప్లీజ్’’ అంటూ బతిమిలాడాయి. నిక్కి సరేనంది. ఇక ఆరోజు నుండి నిక్కికి కూడా బోలెడుమంది స్నేహితులు దొరికారు.


ఉత్తమ శిష్యుడు (21/06/2011)

రాఘవేంద్రస్వాములు ఒక ఆశ్రమ పాఠశాలను నడిపేవారు. అందులో ఎంతోమంది విద్యార్థులు చిన్నతనంలోనే చేరి యుక్తవయసు వచ్చేసరికి మంచి విజ్ఞానవంతులై తిరిగి వెళ్ళేవారు. వారిలో విశ్వనాథుడు, శ్రీనివాసుడు అనే ఇద్దరు శిష్యులు ఉండేవారు. అన్ని విద్యల్లోనూ ఇద్దరూ సమానమైన ప్రతిభ కనబరిచేవారు. స్వాముల వారికి ఆ ఇద్దరంటే చాలా ఇష్టం. తన తరువాత ఆ ఆశ్రమపీఠాన్ని వారిలో ఒకరికి ఇవ్వాలనుకున్నారు. అయితే ఎవరు దానికి అర్హులో తెలుసుకోవడానికి చిన్న పరీక్ష పెట్టాలనుకున్నారు.

ఒకరోజు స్వాములవారు వారిని పిలిచి, ‘‘నాయనల్లారా! నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నాను. రేపటిలోగా నాకో జింక చర్మం కావాలి. తీసుకురండి’’ అన్నాడు. కానీ, అసలు కారణం చెప్పలేదు.

విశ్వనాథుడు, శ్రీనివాసుడు చెరోదిక్కుకు వెళ్లారు. అడవిలో ఎక్కడైనా చనిపోయిన జింక కనబడుతుందేమోనని విశ్వనాథుడు వెతికాడు. ఎంత వెతికినా దొరకలేదు. ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ల్లకి వెళ్ళి జింక చర్మం అమ్మేవారి గురించి ఆరా తీశాడు. అక్కడకూడా దొరక్కపోవడంతో వట్టి చేతులతో ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.

శ్రీనివాసుడు దగ్గరలో ఉన్న ఒక గ్రామానికి ముందుగా వెళ్ళి విల్లు, బాణం, చురకత్తి మొదలైన ఆయుధాలు కొన్నాడు. అరణ్యానికి వెళ్ళి ఒక జింకను వేటాడి చంపాడు. దాని చర్మాన్ని ఒలిచి గురువుగారికి ఇవ్వడానికి బయలుదేరాడు. శ్రీనివాసుడు వెళ్ళే సమయానికి విశ్వనాథుడు చేతులు కట్టుకుని గురువుగారి ముందు నిలబడి జింక చర్మం కోసం తను చేసిన ప్రయత్నం గురించి వివరిస్తున్నాడు.

తరువాత శ్రీనివాసుడు ఎంతో గర్వంగా జింక చర్మం గురువుగారి ముందు పెట్టి దాన్ని తను ఎలా సంపాదించాడో చెప్పాడు. రాఘవేంద్రస్వాములు కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. తరువాత ఇలా అన్నారు, ‘‘నాయనా శ్రీనివాసా! నేను ఇంతకాలం ఈ భూమి మీద పుట్టిన ప్రతిప్రాణికీ జీవించే హక్కు ఉంటుందనీ, సాటిజీవుల పట్ల దయ కలిగి ఉండాలనీ బోధిస్తూ వచ్చాను. నువ్వు విజ్ఞానాన్ని సంపాదించావే కాని, జ్ఞానాన్ని పొందలేదు. విశ్వనాథుడు నా మాటకంటే భూతదయకే ఎక్కువ విలువనిచ్చాడు. ఈ ఆశ్రమ బాధ్యతలను నా తదనంతరం అతనికి అప్పగిస్తున్నాను. ఒక జీవి చనిపోవటానికి నేనూ ఒక కారణం అయ్యాను. నా మనసేం బాలేదు. నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నేను హిమాలయాల్లోకి వెళ్ళిపోతున్నాను’’ అని చెప్పి ఆశ్రమ బాధ్యతలు విశ్వనాథుడికి అప్పగించి హిమాలయాలకు వెళ్ళిపోయారు.

నీతి: జీవహింస మహాపాపం


More Stories: 1 | 2 | 3 | 4