ఆలోచనా మేఘం(29/07/2011)అనగనగా ఒక అందమైన చిన్న పల్లెటూర్లో కొండ పైన ఒక పెద్ద మేఘం ఉండేది. ‘‘ఈ మేఘం కురవడం వల్లనే కొండ పక్కనున్న చెరువు నిండుతోంది. అక్కడున్న మన పొలాలన్నీ చక్కగా పండుతున్నాయి’’ అని ఆ మేఘాన్ని ఆ ఊరి రైతులు మెచ్చుకునే వాళ్లు. సంతోషమైన ముఖం (29/07/2011)అనగనగా ఒక ఊరిలో సంతోష్ అనే అబ్బాయి ఉండేవాడు. అతడు ఒకరోజు ఆడుకుంటూ వాళ్ల ఇంట్లో పాత సామాన్లు ఉన్న గదిలోకి వెళ్లాడు. అక్కడ అతనికి ఒక అద్దం కనిపించింది. నగిషీలు చెక్కి ఉన్న చెక్క ఫ్రేమ్లో ఆ గుండ్రటి అద్దం సంతోష్కి బాగా నచ్చింది. దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి తల్లికి చూపించి, ‘అమ్మా! నేను ఈ అద్దాన్ని తీసుకుంటాను’ అని చెప్పాడు. తల్లి ‘‘సరే నాయనా! కాని జాగ్రత్తగా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇది మన పూర్వీకులది. పాడు చేయకూడదు ’’ అని చెప్పింది. సరేనన్నాడు సంతోష్. స్నేహంతో వ్యాపారం(18/07/2011)అనగనగా ఒక అడవిలో ఒక కొంగ ఉండేది. అది అడవిలో అంగడి తెరిచి పక్షులకు అవసరమైన చిరుధాన్యాలు, చేపలు, పళ్లు, కీటకాలు సేకరించి వ్యాపారం చేసేది. సరసమైన ధరలకే నాణ్యమైన సరుకు అమ్మడంతో చాలా దూరాన ఉండే పక్షులు కూడా కొంగ దగ్గరే ఖరీదు చేసేవి. దాంతో అక్కడికి వచ్చిన పక్షులను ప్రేమతో పలకరించేది కొంగ. అలా వ్యాపారపరంగా చాలా పక్షులు కొంగకు స్నేహితులయ్యాయి. దానికి పేరుతో పాటు డబ్బు కూడా వచ్చింది. స్ఫూర్తి(18/07/2011)చాలాకాలం క్రితం మగధను విక్రమసేనుడు అనే రాజు పాలించేవాడు. ధైర్యసాహసాలుగల విక్రమసేనుడు తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఆయన రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల మీద నడవడమే కాకుండా రాజ్యం కన్నులపండువుగా సంపదలతో తులతూగుతూ ఉండేది. శత్రువైరం (18/07/2011)పూర్వం ఒక పండితుడి ఇంట్లో పాడి ఆవు ఉండేది. ఒక దొంగ కన్ను ఆ ఆవుమీద పడింది. ఎలాగైనా దానిని దొంగలించాలనుకుని ఒక రాత్రి ఆ ఇంటికి వచ్చాడు. అప్పటికే అక్కడ ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. దొంగ ఆ రాక్షసునితో ‘‘అయ్యా! నమస్కారం, మీరిక్కడికి ఎందుకు వచ్చినట్లు?’’ అని అడిగాడు. దురాశకు పోతే దుఃఖం(11/07/2011)ఒకసారి ఒక సాధు పుంగవుడు తన శిష్యులందరి పట్ల సంతుష్టుడై ‘మీకు అమోఘమైన ఒక మంత్రం ఉపదేశిస్తాను. దాన్ని సక్రమంగా ఉపయోగించుకుని జీవితాన్ని సంతోషంగా గడపండి’ అని ఒక మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని చదివి మీకేం కావాలంటే అది కోరుకోండి అది జరుగుతుంది. ఒక్కసారి మాత్రమే. దీన్ని దుర్వినియోగం చేయకండి’‘ అని చెప్పాడు. ఆ శిష్యులలో ఆశారాం అనేవాడు అసంతృప్తితో ‘స్వామీ ఇంతకాలంనుంచి మిమ్ము సేవించుకున్నాను. ఒక్క మంత్రమేనా ఉపదేశించేది?’ రెండింటిని కోరుకునేలా నాకు ఇంకో మంత్రం ఉపదేశించండి’ అని అడిగాడు. అందరు శిష్యులు ఇచ్చినదానితో తృప్తి పడితే వీనికి ఆశ ఎక్కువగా ఉంది అనుకుని ఆ సాధువు ‘అందరికీ సమానంగా మంత్రం ఉపదేశించా, నీకు ఆశ పనికిరాదు, దొరికిన దానితో తృప్తిపడాలి’ అని హితవు చెప్పాడు. కానీ ఆశారాం వినకుండా తనకు ఇంకో మంత్రం ఉపదేశించాల్సిందే అని పట్టుపట్టాడు. సరియైన న్యాయం(11/07/2011)పూర్వం అవంతి రాజ్యాన్ని సునందుడనే రాజు పరిపాలించేవాడు. రాజ్యంలో సుఖశాంతులు నిండుగా ఉన్నాయి. సకాలానికి వర్షాలు పడి పంటలు బాగా పండుతున్నాయి. ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. న్యాయం నాలుగు పాదాల నడుస్తుంది. దానికి ముఖ్య కారణం ధర్మపాలుడనే న్యాయాధికారి కొలువులో పనిచెయ్యడమే.సమస్యలను న్యాయబద్ధంగా పరిష్కరించేవాడు. అందువల్ల రాజన్నా, న్యాయాధికారి ధర్మపాలుడన్నా ప్రజలకు ఎంతో ఇష్టం. కోతుల సహాయం (11/07/2011)ఒక నదిలో రకరకాల అందమైన చేపలు ఉన్నాయి. ఆ నది ఒడ్డున ఒక నేరేడుచెట్టు ఉంది. ఆ చెట్టు మీద కొన్ని కోతులు ఉన్నాయి. ఆ కోతులు నేరేడుచెట్టు కొమ్మల మీద గెంతుతూ, పండ్లు కోసుకు తినేవి. అప్పుడప్పుడూ కొన్ని పండ్లు జారి కింద ఉన్న నదిలో పడిపోయేవి. ఆ పండ్లు నీళ్ళలో మునిగిపోకుండా చేపలు వాటిని పట్టుకుని జాగ్రత్తగా తీసుకువచ్చి కోతులకు అందించేవి. అలా కోతులకు చేపలకు స్నేహం కుదిరింది. కందిరీగ సహాయం (11/07/2011)ఒక అడవిలో ఒక చిలుక, కందిరీగ జీవిస్తూ ఉండేవి. చిలుక తనను తాను చూసుకుని గర్వంతో పొంగిపోయేది. కందిరీగను తరచుగా ఆటపట్టిస్తుండేది. ఒకరోజు చిలుక తన గూటిలో వుూడు గుడ్లు పెట్టింది. మరుసటి రోజు చిలుక నివసించే చెట్టు దగ్గరలో ఒక పిల్లి తచ్చాడుతుండడం గవునించింది. ‘‘అయ్యు బాబోయ్! నా గుడ్లను ఈ దొంగ పిల్లి తినేస్తుందేమో’’ అని తెగ కంగారు పడిపోరుుంది. అది అలా అనుకుంటూండగానే, పిల్లి ‘‘ఈ రోజుకు నాకీ గుడ్లు చాలు’’ అనుకుంటూ చెట్టును సమీపించి, మెల్లిగా చెట్టు ఎక్కడం మొదలెట్టింది. భయుంతో చెవుటలు పట్టిన చిలుక ‘‘కాపాడండి, కాపాడండి’’ అని అరవడం ప్రారంభించింది. కోతి తిక్క కుదిరింది (11/07/2011)ఒక అడవిలోకి ఎక్కడి నుంచి వచ్చిందో కాని ఒక కోతి వచ్చి, పెద్ద రావి చెట్టు మీద ఉండసాగింది. ఆ చెట్టు మీద ఒక పావురం, పిచ్చుకల జంట, కాకి జీవిస్తున్నారుు. అవి ఒక దాని జోలికి వురొకటి వెళ్లేవి కావు. దేని ఆహారం అది సంపాదించుకుంటూప్రశాంతంగా జీవించేవి. కోతిది మాత్రం చంచల వునస్తత్త్వం. |